Saturday, July 4, 2026
HomeTelanganaడీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు ప్రశంసనీయం'

డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు ప్రశంసనీయం’

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ మహేందర్ రెడ్డి చేసిన సేవలు ప్రశంసనీయమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రేపు (శనివారం) మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి హైదరాబాద్ లక్ష్మీకపూర్ లోనీ తన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డికి జ్ఞాపికను, పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి మహేందర్ రెడ్డి రాష్ట్రానికి సేవలందించారన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖను దేశంలోనే అగ్రస్థానంగా నిలిపారన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.