Monday, August 17, 2026
HomeTelanganaశాంతిభద్రతలకు సహకరించాలి..?

శాంతిభద్రతలకు సహకరించాలి..?

📰 Generate e-Paper Clip

బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్

అనవసరంగా క్షణిక ఆవేశం లో కేసుల పాలై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

మంచిర్యాల బెల్లంపల్లి: రూరల్ సర్కిల్ కార్యాలయంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఆర్మీ ఉద్యోగాలకు ఎన్నికైన మరియు ప్రయత్నం చేస్తున్నటువంటి 45 మంది యువకులకు సోమవరం బెల్లంపల్లి ఏసీపి ఏడ్ల మహేష్ గారి ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసిపి గారు మాట్లాడుతూ… శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ప్రజా జీవనానికి భంగం కలిగినా, ఆస్తులను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామన్నారు. వివిధ ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటనలు వస్తున్నాయని, యువత లక్ష్యసాధనకు చదువుకోవాల న్నారు అల్లరులు, విద్వాంసం లకు పాల్పడేవారు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కంటే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. పూకార్లను నమ్మవద్దని, సామానిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేసినా కఠినచర్యలు తప్పవని అన్ని సామాజిక మాధ్యమాలపై పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో యువత ఉద్యోగాలకు సిద్ధంకావాలన్నారు. అల్లర్లు, నిర్వంసాలకు పాల్పడే వారు ఎలాంటి పరిస్థితిలో తప్పించుకోలేరని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ ప్రమోద్ రావు బెల్లంపల్లి రూరల్ సీఐ బాబు రావు, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ రాజు, ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.