
రూపాయికే అన్ని సౌకర్యాలు సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ
రంగారెడ్డి జిల్లా , షాద్ నగర్: నిరుపేదలకు, గ్రామస్తులకు చివరి మజిలీ అయిన మరణం భారం కాకూడదని భావించిన తెలంగాణ ప్రభుత్వం వైకుంఠధామాలను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.అవసరమైన వారు వైకుంఠధామాలను సద్వినియోగం చేసుకోవాలని కెశంపేట మండలం కాకునూరు గ్రామ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ అన్నారు.కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే మనిషి జీవితంలో ఆఖరి ప్రయాణాన్ని కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరు వైకుంఠ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


