Saturday, August 22, 2026
HomeTelanganaసేంద్రీయ పంటల విక్రయ కేంద్రం భవన నిర్మాణంకు భూమిపూజ.

సేంద్రీయ పంటల విక్రయ కేంద్రం భవన నిర్మాణంకు భూమిపూజ.

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సేంద్రీయ పంటల విక్రయ కేంద్రం భవన నిర్మాణం పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి శివాని, ఎసిపి సాధన రష్మి పెరుమాళ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రీయ పంటలు పండించే రైతులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేంద్రీయ విధానంలో రైతులు పండించిన కూరగాయలు, పళ్ళు, చిరుధాన్యాలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.