Friday, August 21, 2026
HomeTelanganaనల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికుల నిరసన.

నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికుల నిరసన.

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం మంచిర్యాల డిపోలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక సంఘ కార్యకలాపాలకు అనుమతించాలని, 2017- 21 పే స్కేల్, 6 డిఏలు అమలు చేయాలని, పీఎఫ్, సిసిఎస్ సంస్థలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రీజినల్ కార్యదర్శి వి. భీమేశ్వరరావు, డిపో అధ్యక్షుడు రాజేశం, నాయకులు ఉమారాణి, సరోజన, సంధ్య, సిహెచ్ లింగన్న, శంకర్, మేడారం రాజయ్య, శ్రీను, దుర్గేష్, నజీర్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.