
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రెబ్బెన పోలీస్ వారి ఆధ్వర్యంలో గత 4 రోజుల క్రితం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గంగాపూర్ గ్రామానికి చెందిన నాయిని వెంకటి పెంకుటిల్లు కూలిపోయి తీవ్ర ఆస్తినష్టం జరిగింది. రెబ్బెన ఎస్ఐ ఎల్. భూమేష్ మంగళవారం వారికి క్వింటాల్ నరబియ్యం, నిత్యావసర వస్తువులు, 1000/- నగదు ఇచ్చారు. కార్యక్రమంలో పందిర్ల మధునయ్య, ముంజమ్ వినోద్, ఇగురపు, సంజీవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

