గుడిపల్లిలో జరిగిన సజీవదహనం కేసు మరో మలుపు తిరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గుడిపల్లిలో జరిగిన సజీవదహనం కేసు మరో మలుపు తిరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దహనం కోసం నిందితులు శ్రీరాంపూర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ లో 40 లీటర్ల పెట్రోల్ ను కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసు మరో మలుపు తిరిగినట్లు సమాచారం. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దీని ఆధారంగా ఈ కేసులో పాత నేరస్తుల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2020లో లక్సెట్టి పేటకు చెందిన రవికుమార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో కరోన వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందన్నారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఈ కేసు ఫైల్ ను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సజీవ దహనం కేసులో ఆ హత్యతో సంబంధం ఉన్న అనుమానితులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ బంక్ లోనీ సీసీ ఫుటేజ్ ఆధారంగా లక్సెట్టి పేటకు చెందిన ఇద్దరు, గోదావరిఖనికి చేందిన ఇద్దరు ఒడిదెలకు చెందిన మరో వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ మర్డర్లు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఒక్కరోజులో వేసిన స్కెచ్ కాదన్నారు. పక్కగా ప్లాన్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

