
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 15వ వార్డులో లబ్ధిదారులకు శుక్రవారం వర్డ్ కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్ అధ్వర్యంలో ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చెర్మేన్ పెంట రాజయ్య హాజరై స్థానిక వార్డు కౌన్సిలర్ తో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంఛార్జి రమేష్ ఆర్పీలు జ్యోతి, సంధ్య రాణి, పుష్పలీలా మరియు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

