
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 26న స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉ దయం 10 గం॥ల నుండి 11 గం||ల వరకు స్థాయి కమిటీ-2 (గ్రామీణాభివృద్ధి), ఉదయం 11 గం||ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు స్థాయి కమిటీ-3 (వ్యవసాయం), మధ్యాహ్నం 12 గం॥ల నుండి 1 గం॥ల వరకు స్థాయి కమిటీ-4 (విద్య, వైద్య సేవలు), మధ్యాహ్నం 1 గం॥ల నుండి 2 గం||ల వరకు స్థాయి కమిటీ-5 (మహిళా సంక్షేమం), మధ్యాహ్నం 3 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు స్థాయి కమిటీ-6 (సాంఘిక సంక్షేమం), సాయంత్రం 4 గం॥ల నుండి 5 గం||ల వరకు స్థాయి కమిటీ-7 (నిర్మాణ పనులు), స్థాయి కమిటీ-1 (ప్రణాళిక, ఆర్థిక) సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గౌరవ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో నకాలంలో హాజరు కావాలని కోరారు.

