
ఐ/సి రిజిస్ట్రార్ (ప్రొటోకాల్) ఓ.ఎన్.డి. పి. శ్రీధర్ రావు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని బెల్లంపల్లిలో ఈ నెల 10వ తేదీన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ. వెంకటేశ్వర రెడ్డి వస్తున్నారని ఐ/సి రిజిస్ట్రార్ (ప్రొటోకాల్) ఓ.ఎన్.డి. పి. శ్రీధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 9.30 గం॥ లకు జిల్లాలోని సి.సి.సి.లో గల సింగరేణి అతిథి గృహానికి చేరుకుంటారని, 10 గం॥లకు మంచిర్యాల నుండి బయలుదేరి 10.30 గం||లకు బెల్లంపల్లిలోని సింగరేణి అతిథి గృహానికి చేరుకొని 11 గం॥లకు జూనియర్ సివిల్ జడ్జి భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు.

