Monday, August 17, 2026
HomeTelanganaదళితులకు ద్రోహం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

దళితులకు ద్రోహం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడ్డ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేసిందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఆరోపించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పథకాలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ఎన్నికలకు ముందే ప్రతి దళితులందరికి దళిత బంధు ఇవ్వాలని, మాలలకు మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను తక్షణమే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ తీసేయాలన్న కుట్రతో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అమ్మేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆసాది పురుషోత్తం, రాష్ట్ర కార్య దర్శి దేవి పోతన్న, ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు, నాయకులు దేవరపల్లి మధుబాబు, ఆసాది చిట్టిబాబు, ఎడ్ల కిష్టయ్య, బైరం లింగన్న, పెండం సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.