Friday, July 3, 2026
HomePoliticalతొలి అడుగులోనే సంచలన గెలుపు

తొలి అడుగులోనే సంచలన గెలుపు

📰 Generate e-Paper Clip

రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు తొలిసారి అవకాశం దక్కించుకుని.. విజయాన్నీ సాధించారు. వీరిలో కొందరు రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు.

• యశస్వినిరెడ్డి (26): పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మామిడాల యశస్వినిరెడ్డి బరిలో నిలిచి, ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించారు.

• మైనంపల్లి రోహిత్ రావు (26): వైద్యుడైన రోహిత్(కాంగ్రెస్).. మెదక్ లో అప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డి (భారాస)పై సంచలన విజయం సాధించారు.

Post Midle

• చిట్టెం పర్ణికారెడ్డి (30): నారాయణపేట నుంచి రేడియాలజిస్ట్ చిట్టెం పర్ణికారెడ్డి(కాంగ్రెస్) వరుసగా రెండుసార్లు గెలిచిన రాజేందర్ రెడ్డి (భారాస)పై విజయం సాధించారు.

• వెడ్మా బొజ్జు (37): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మా బొజ్జుపటేల్ అనూహ్యంగా గెలుపొందారు. భాజపా నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ భారాస నుంచి ఎన్నారై భూక్యా జాన్సన్లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టంకట్టారు.

• లాస్య నందిత (38): దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె అయిన నందిత కంటోన్మెంట్ నుంచి భారాస అభ్యర్థిగా పోటీచేసి, స్థానికంగా గుర్తింపు ఉన్న శ్రీగణేష్(భాజపా)పై గెలిచారు.

• కల్వకుంట్ల సంజయ్ (47): స్పైన్ సర్జన్ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(భారాస) కోరుట్లలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(భాజపా)పై గెలిచారు.

• కుందూరు జైవీర్ రెడ్డి (48): నాగార్జునసాగర్ లో జైవీర్ రెడ్డి(కాంగ్రెస్). సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్ (భారాస)పై గెలిచారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.