
ఆకట్టుకుంటున్న స్టుడెంట్ లీడ్ కాన్ఫరెన్స్
ఆదర్శ విద్యాలయం హై స్కూల్లో ఘనంగా విద్యార్థుల కాన్ఫరెన్స్ కార్యక్రమం.
షాద్ నగర్: ప్రత్యేక ఆవిష్కరణలు చేయాలన్నారు ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి,సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి లు.శనివారం కేశంపేట మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో శనివారం స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు బి వెంకట్ రెడ్డి తెలిపారు.ఆధునిక భారత విజ్ఞానశాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తి సర్ సివి రామన్ అని పేర్కొన్నారు. ముందుగా సరస్వతి చిత్రపటానికి స్థానిక సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి,పంచాయితీ సెక్రటరీ,బొదునంపల్లి టిఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ లు జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల మేధస్సును గుర్తించి వారిని ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేయాలని,పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరూ గొప్ప స్థాయికి రావాలని కోరారు.

ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేయడం వలన విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం మరియు వారిలో సృజనాత్మకత పెరుగుతుంది అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.ఇందులో భాగంగా చిన్నారులు చేసిన హ్యూమన్ హార్ట్,వాటర్ డిస్పేంసర్ చూపరులను ఆలొచింపచేశాయి. ఇలాంటి కార్యక్రమాలు జరపడం వలన విద్యార్థులలో భయం పోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేష్, శ్రీరాములు,శ్రీను,భాగ్యరాజు,కృష్ణ, శ్రీశైలం, ఉపాధ్యాయురాలు నర్మదా, అన్నాపూర్ణ, మణెమ్మ,స్వాతి,స్పందన,శ్రీ సాయిరూప, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు…

