
మంచిర్యాల జిల్లా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మధ్య వివాదం సమసిపోయింది. గతంలో అధిష్టానం ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన వీహెచ్ ను ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అడ్డుకోగా వీహెచ్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన సమావేశంలో.. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడలేనని, జరిగిన దానికి చింతిస్తున్నానంటూ ప్రేమ్ సాగర్ రావు వీహెచ్ కు క్షమాపణ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వివాదానికి తెరపడింది..

