
బీఆర్ఎస్ యువ నాయకులు విజిత్ రావు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తనయుడు, బీఆర్ఎస్ యువ నాయకులు విజిత్ రావు అన్నారు. సోమవారం లక్షేట్టిపేట్ మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామంలో ఇంటింటికీ బీఆర్ఎస్ పార్టీ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

