
సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్ చెన్న సోమశేఖర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: రెబ్బెన మండలం నంబాల గ్రామపంచాయతీలో శుక్రవారం సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ చెన్న సోమశేఖర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఏలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రతలు తీసుకునే విషయంలో వార్డు సభ్యులు అందరు కలిసి ముందుకు రావాలని కోరారు. అదే విధంగా గ్రామంలోని పలు సమస్యలను గుర్తించడం పలు అభివృద్ధి పనులను గుర్తించి తీర్మానాలు చేయడం జరిగింది.
ఈ కరిక్రమంలో ఉప సర్పంచ్ అశోక్ వార్డు సభ్యులు పద్మ, రజిత, భూదేవీ, ఇంద్ర సేన గౌడ్, మధుకర్, గోపాల్ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.

