
తెలంగాణ: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఈటల రాజేందర్ పై తీవ్ర విమర్శలు చేశారు. నేడు ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కళ్లు నెత్తికెక్కాయని అన్నారు..
సీఎంపై, మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పద్దతి మార్చుకోవాలని, లేదంటే చూస్తూ ఊరుకోమని బాల్క సుమన్ హెచ్చరించాడు. ఈటలను మంత్రిగా చేసింది కేసీఆర్ అని, కానీ ఈటల తిన్నింటి వాసాలను లెక్కబెట్టారని మండిపడ్డారు.

