Friday, July 3, 2026
HomeTelanganaఇంటింటికి పాదయాత్ర 100వ రోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభం

ఇంటింటికి పాదయాత్ర 100వ రోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ నాయకులు తూండ్ల సాగర్ యాదవ్

Post Midle

ఐబీ కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అలోచన మేరకు అయిన అశీస్సులతో ఆయన తనయుడు విజిత్ కుమార్ మంచిర్యాల నియోజకవర్గం లోని ఇంటింటికి పాదయాత్ర 100వ రోజులు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తూండ్ల సాగర్ యాదవ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ కేంద్రంలో శనివారం చలివెంద్రం ఏర్పటు చేశారు. ఈ సందర్భంగా సాగర్ యాదవ్ మాట్లాడుతూ.. ఇంటింటికి పాదయాత్ర వంద రోజులు పూర్థి చేసుకున్న సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నడిపల్లి విజిత్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.. అలాగే ప్రజలకు సేవ చేయడంలో గాని ప్రజా సమస్యలపై గళం ఎత్తడంలో గాని బీఆర్ఎస్ యువ నాయకులు విజీత్ కుమార్ ముందు ఉండడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సాగర్ యాదవ్ ను విజిత్ కుమార్ అభినందించారు.. అనంతరం మజ్జిగ పంపిణి చేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ పెంట రాజయ్య బీఆర్ఎస్ నాయకులు విజిత్ కూమర్, కాన్సిలర్, హరికృష్ణ సూజిత్ రవిందర్, తోట తిరుపతి, సుధీర్ టవర్ శ్రీను, ప్రవీష్ పోలం రాజ్ కుమార్, రవి గట్టయ్య, కరిగింటి సరిధి చంటక్క, సాయి, కాటంరాజు బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.