మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో తన నివాస గృహం ముందు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 338 మంది లబ్ధిదారులకు కోటి ఐదు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల (1,05,08,800/-) రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటానని భరోసా ఇచ్చారు. మంచిర్యాల ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా విద్యారంగం అభివృద్ధి పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 24 కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి మంచి విద్యాబోధన అందించాలని సంకల్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

