Thursday, July 2, 2026
HomeTelanganaసీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీపీ

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీపీ

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని కాసిపేట గ్రామంచాయితీ లోని చంద్రపల్లి గ్రామంలో గురువారం సీసీ రోడ్డు పనులను ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో  ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసిందని తెలిపారు. పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని అన్నారు.దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి ఒక్క బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి  సాలిగామ బాణయ్య, కోప్షన్ రెహమాత్ ఖన్, సర్పంచ్ అస్ప రమేష్, రుకుం సంతోష్, బోయిని రాజేష్, పుల్గం వెంకటేష్, వార్డ్ మెంబర్ పెండ్యాల వెంకటేష్, ఇనుముల తిరుపతి, పెండ్యాల పోషం, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.