Telugu Updates
Logo
Natyam ad

సీఎం పై యువకుడి దాడి..!

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. సీఎం సొంత ఊరైన కితాపూర్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి యత్నించిన వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది. అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో షిల్భద్ర యాజీ అనే స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నితీశ్ హాజరయ్యారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చిన ఓ యువకుడు సీఎం వీపుపై కొట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భద్రతా సిబ్బంది ఉండగా ఓ సాధారణ వ్యక్తి ఇలా దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తోంది..