బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2కె రన్
మంచిర్యాల జిల్లా: మందమర్రి లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గురువారం బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో 2కె రన్ నిర్వహించారు సింగరేణి స్కూల్ నుండి ప్రారంభమైన 2కె రన్ లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎసీపి ఎడ్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.