
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోనీ వివేక వర్ధిని డిగ్రీ కళాశాలలో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారులుగా రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి రాష్ట్ర కార్యదర్శి నారమల్ల విజయ్ కుమార్ హాజరై ఎన్నికలను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా డిజెఎఫ్ అధ్యక్షునిగా తీగల శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొండ ప్రవీణ్ కుమార్, జిల్లా కోశాధికారిగా చిడిపి ప్రవీణ్ ఆనంద్ కుమార్, ఉపాధ్యక్షులుగా పులి రాజారాం, పిలు మల్ల గట్టయ్య, కుదురుపాక పోశం, కార్యదర్శులుగా మేకల తిరుపతి.
, దండే భూమయ్య, వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా గడ్డం పున్నం, గంగులు ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్ ల హొక్కులకోసం పోరాడలన్నారు రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ సమస్యా వచ్చిన డిజెఎఫ్ ముందుంటుందన్నారు.. అనంతరం నూతన కమిటీకి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

