Tuesday, August 18, 2026
HomeTelanganaపాఠశాలలో పాముల పుట్ట.. పట్టించుకోండి సారు.!

పాఠశాలలో పాముల పుట్ట.. పట్టించుకోండి సారు.!

📰 Generate e-Paper Clip

భయం భయంగా బడికి వెళ్తున్న విద్యార్థులు

అసంపూర్తిగా పాఠశాల భవనం

గదుల్లో సిమెంటు గచ్చు లేక చాపపై కూర్చొని విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు

ఆంజనేయులు న్యూస్, తిర్యాణి: కొమరం భీమ్ జిల్లా తిర్యాణి మండలంలోని ముల్కలమంద గ్రామ పంచాయతీ తోయరేటి గిరిజన ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలో పాముల పుట్ట ఉంది. దీంతో విద్యార్థులు భయం భయంగా బడికి వెళ్తూ చదువుకోవాల్సి వస్తోంది. గదుల్లో సిమెంటు గచ్చు నిర్మించకపోవడంతో నేలపైనే ఓ చాపపై కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు. బందరాఘాట్, తోయరేటి, ఇప్పగూడ చెందిన 11 మంది గిరిజన విద్యార్థులు.. 1- 3వ తరగతి వరకు చదువుకుంటున్నారు. 17 ఏళ్ల కిందట రూ.5 లక్షలతో ఈ పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించగా.. ఇప్పటి వరకు సిమెంటుతో గోడలకు పూతలు లేక నేలపై గచ్చు వేయక, తలుపులు, కిటీకీలు, విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. దీంతోపాటు రెగ్యూలర్ ఉపాధ్యాయుడిని కూడా నియమించకపోవడంతో.. సీఆర్టీతో బడి కొనసాగుతోంది. ఈ విషయంపై రొంపల్లి ఎస్ఈఆర్పీ వెడ్మ యశ్వంత్ ను “ఆంజనేయులు న్యూస్” వివరణ కోరగా.. సమస్యపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఈ బడి ఎంపికై రూ.2.15 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఈ నిధులు సరిపోవని మహిళా సంఘాల సభ్యులు ముందుకు రాలేదని సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి భవనాన్ని పూర్తి చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మా బడిని పట్టించుకోండి సారు.! అని గ్రామీణ వాసులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.