ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

ఆంజనేయులు న్యూస్, వనపర్తి జిల్లా: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలం బండపల్లి పాఠశాలలో జరిగింది. ఈ పాఠశాలలో 110 విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సోమవారం పలువురు బియ్యాన్ని పరిశీలించగా. బూజు పట్టి పురుగులు నిండి ఉన్నాయి.

