బాధితుని నుండి లక్ష రూపాయలు డిమాండ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెటింగ్ పాడి కొనుగోలు శాఖ అధికారి కె. శారద సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కాటన్ ఆగ్రో ఏజెన్సీ లైసెన్స్ రెన్యువల్ కోసం విశ్వేశ్వర్ అనే స్థానిక వ్యాపారి నుంచి ఆమె రూ. ఒక లక్ష లంచం డిమాండ్ చేసింది. బాధితుడు మొదటి దఫాగా రూ. 15 వేలు ఆమెకి ఇచ్చాడు. అనంతరం ఏసీబీని ఆ వ్యాపారి ఆశ్రయించాడు. ఈ మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ లో వ్యాపారి నుంచి రెండో దఫాగా రూ.65వేల లంచం తీసుకుంటుండగా ఆమెను పట్టుకున్నారు. అనంతరం ఎసిబి డిఎస్పి భద్రయ్య మాట్లాడుతూ..

