
డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్
ఆంజనేయులు న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లా పరిధిలో పోలీస్ వాహనాల పాత స్పెర్ పార్ట్స్, టైర్లు, బ్యాటరీలు, ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్ ను ఈ నెల 22న బహిరంగ వేలం వేయనున్నట్లు డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో వేలం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్ఎస్ఐ (MTO ) మధుకర్ ను 7901126902, 8712656616 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

