
మంచిర్యాల జిల్లా: భారీ వర్షాలు కురుస్తుండడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు పూర్తిగా జలమయం కావడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు పోలీసులు సేవలు అందిస్తూ మానవతను చాటుకుంటున్నారు. గురువారం ఉదయం స్థానిక లక్ష్మీ నగర్ లో ఇళ్లల్లోకి నీరు రావడంతో బాయా బ్రాంతులకు గురై డైల్100కు కాల్ చెసారు.. వెంటనే స్పందించిన బ్లూ కోర్ట్ సిబ్బంది సత్యనారాయణ, లు అక్కడికి చేరుకొని కాలనీవాసులని సమీప బంధువుల ఇంటికి పంపించారు.. అనారోగ్యంతో బాధపడుతున్న నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం మోకాలి లోతు నీళ్లలో ప్రధాన రహదారిపై తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.. వారిని పలువురి స్థానికులు అభినందించారు.. 


