Monday, August 17, 2026
HomeTelanganaగవర్నర్, సీఎంల మధ్య చిరునవ్వులు..?

గవర్నర్, సీఎంల మధ్య చిరునవ్వులు..?

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎనిమిది నెలల తర్వాత ఇవాళ రాజ్ భవన్ కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11న అప్పటి సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణస్వీకారం కోసం వెళ్లిన ఆయన.. ఆ తర్వాత రాజభవన్ వైపు చూడలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్  ప్రమాణస్వీకారానికి ఇవాళ కేసీఆర్ హాజరయ్యారు. ఇటీవల రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం బాగా పెరిగిన విషయం తెలిసిందే. వివిధ అంశాల్లో రాజ్ భవన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలొచ్చాయి. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని, కనీసం తల్లి మరణిస్తే కూడా కేసీఆర్ పలకరించలేదని గవర్నర్ తమిళసై గతంలో వ్యాఖ్యానించారు. ఒక మహిళగానైనా తనకు గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో గవర్నర్ వైఖరిని మంత్రులు తప్పుబట్టారు. ఈ క్రమంలో రాజ్ భవన్, ప్రభుత్వం మధ్య రాజకీయ పరమైన విమర్శలు కూడా వచ్చాయి. గవర్నర్ నివాసంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సీఎం సహా మంత్రులు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సీజే  ప్రమాణస్వీకారం కోసం సీఎం రాజ్భవన్ కు వెళ్లారు..ఈ సందర్భంగా గవర్నర్, సీఎం పరస్పరం పుష్పగుచ్ఛాలతో గౌరవించుకున్నారు. ఈ సమయంలో ఇరువురి మధ్య చిరునవ్వులు వెల్లివిరిశాయి. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందులోనూ సరదాగా ఉన్నారు. గవర్నర్, సీఎం మధ్య సమావేశం సాఫీగా, సహృద్భావ వాతావరణంలో జరిగిందని రాజభవన్ వర్గాలు వెల్లడించాయి..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.