
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ను కించపరిచేలా నాటకం ప్రదర్శించారంటూ భాజపా నాయకులు రాణి రుద్ర, దరువు ఎల్లన్నను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాదిలో’ సభలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా 41A CRPC కింద నోటీసులు జారీ చేసినట్లు హయత్ నగర్ పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్టు చేయగా.. ఆయన బెయిల్ పై విడుదలయ్యారు..
