ఎమ్మెల్యే నిరవధిక నిరాహార దీక్ష..!
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,ఆగస్ట్18,: సిర్పూర్ టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాగజ్ నగర్ లోని తన నివాసంలో సోమవారం రోజున నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. పోడు భూముల సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించబోనని తెలిపారు. ఈ దీక్షలో పలువురు బీజేపీ నాయకులు, పోడు రైతులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

