జీవో నం.49, పోడు భూముల సమస్య పై శాసన సభ స్పీకర్ కి లేఖ రాసిన ఎమ్మెల్యే.
ఆంజనేయులు న్యూస్,కాగజ్ నగర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.49ని రద్దు చేయాలని, పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని శాసన సభ స్పీకర్ కి లేఖ రాసిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మంగళవారం రోజున ఒక ప్రకటన లో పేర్కొన్నారు.


