

బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్.
కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,: పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కాగజ్ నగర్ డివిజన్ అటవిశాఖ కార్యాలయం ముట్టడికి బీజేపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. ఈక్రమంలో ఆయనను పోలీసులు హౌస్ చేశారు. అనంతరం పోలీసులు నియోజకవర్గ బీజేపి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలిస్ స్టేషన్లకు తరలించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్లతో తమ పోరాటాన్ని ఆపలేరన్నారు.

