మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ మోతె సుజాత కాంగ్రెస్ ను వీడి బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆమె టిఆర్ఎస్ లో చేరగా, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, జిల్లా టిఆర్ఎస్. అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.