బర్త్ డే పేరుతో… బాలికకు పెళ్లి..!
రంగారెడ్డి జిల్లా: కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిగింది. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికకు పెళ్లి చేశారు. దీంతో బాలిక.. పెళ్లి విషయాన్ని ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామస్థులకు తెలిపింది. అనంతరం పెళ్లి ఇష్టం లేదని బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో బాలిక ఉన్న చోటుకు వచ్చి బంధువులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదంతో బంధువుల ఇంటి నుంచి బాలిక వెళ్లిపోయింది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..