ఎంజీ ఎన్ ఆర్ జీ ఏ చట్టాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరించాలి
ప్రజల హక్కును తిరిగి కల్పించాలి
పంచాయతీల పాలనాధికారాన్ని పునరుద్దరించాలి

ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆదేశాల మేరకు అసిఫాబాద్ పార్టీ ఇంచార్జి అజ్మీర శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలోని రాజారాం గ్రామ పంచాయతీలో వీ బీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని గ్రామ ప్రజలకు ఈ చట్టం ద్వారా కలిగే దుష్పరిణామాల గురించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్ ఆధ్వర్యంలో రాజారాం గ్రామ సర్పంచ్ లక్ష్మీ పురుషోత్తం గ్రామస్తులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు జరిగే నష్టాల వివరణ. మొదటిది ఇప్పటికే ఉన్న నిరుద్యోగ వ్యవస్థ ఇంకా పెరుగుతుంది మరియు కూలీలను దోపిడిలు చేయడం వలన వలసలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. మహిళల ఉపాధి కోల్పోయి దళిత ఆదివాసీ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతారు అలా వలసలు వెళ్ళినప్పుడు గ్రామాలు కాలి అయినప్పుడు గ్రామంలో నిర్మించే ఆస్తులపై ప్రజల హక్కులు కోల్పోతారు ఇలా ఎటు చూసిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తెలియకుండా తీరని నష్టాన్ని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల కోసం న్యాయ పోరాటం చేస్తున్నామని ఈ కార్యక్రమ సభ ముఖాన తెలియచేయడమైనది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేసరి కిషన్ గౌడ్ రాజారం సర్పంచ్ పూదరి లక్ష్మి పురుషోత్తం. ఉప సర్పంచ్ శ్రీధర్ మాజీ సర్పంచులు చెన్న సోమశేఖర్ మనం కార్తీక్ రత్నం, వెంకటి శ్రీకాంత్, మాజీ జెడ్పిటిసి వేముల సంతోష్, మాజీ ఎంపీటీసీ మద్దెల సురేందర్, రాజు సీనియర్ నాయకులు చిరంజీవి గౌడ్, పూదరి హరీష్, మహేష్, శంకర్, చిట్యాల శంకర్, ఓరగంటి గణేష్, మహేష్, కోటేష్ నగేష్ రత్నం ఆనందరావు కోట తిరుపతి నాగరాజు శంకర్ యూత్ కాంగ్రెస్ నాయకులు కమల్నాథ్ రెడ్డి సాయి ఎర్రం తిరుపతి గుండా రవీందర్ ఇంగు శశి కిరణ్ పిరిసింగుల రాజన్న దేవరకొండ సంతోష్ డోంగ్రి ప్రణయ్ వార్డు సభ్యులు జూపాక రాజేశ్వరి పూదరి వెంకటేష్ అనిల్ మరియు గ్రామస్తులు మహిళా నాయకురాలు డోంగ్రి పద్మ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.