
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సమాజంలో యువత చెడు వ్యస సనాలకు బానిసై తమ జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో అద్దం పట్టే “యువత జరభద్రం” అనే లఘ చిత్రాన్ని మంగళవారం మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎ.భాస్కర్ తన చాంబర్లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మరియు లఘు చిత్రం సందేశం మార్గదర్శకులు గుండేటి యోగేశ్వర్, తన ప్రియతమ ఉత్తమ ఎన్.సి.సి క్యాడెట్ నార్ల మహేందర్ దర్శకత్వంలో యువత చదువును నిర్లక్ష్యం చేస్తూ తప్పుడు స్నేహాలతో చేడు వ్యాసనలకు అలవాటు పడితే వారి భవిష్యత్తు ఎలా చెడి పోతుందో తెలిపే గంజాయి మద్యం, మాదకద్రవ్యాలు లాంటి మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దు అని తమ లఘచిత్రం ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. చిత్రం రూపొందించిన నార్ల మహేందర్ ను,ప్రోత్సహించిన యోగేశ్వర్, నటులు ఆకాష్, అనిల్ ,సాగర్, బృందాన్ని అభినందించారు. ఈ చిత్రాన్ని టీ బ్రేక్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చని తెలిపారు.