
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నకిలీ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్న పెద్దిటి యోహాను అనే వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు రవీంద్ర భారతిలో పలువురికి సర్టిఫికెట్లను అందజేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరుతో డబ్బులు తీసుకుని వీటిని ప్రదానం చేస్తున్నటు గుర్తించారు. సాహిత్యం, కళలు విభాగంతో వీటిని ఇస్తున్నారు. ఈమేరకు యోహానుపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.