Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 12:41 pm Posted by : Unknown Author

జీవో నం49,పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జి మంత్రి స్పందించాలి.

జీవో నం49,పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలిసిర్పూర్ ఎమ్యెల్యే.



కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,
కాగజ్ నగర్:
జీవో నం.49, పోడు రైతుల సమస్యలపై మూడవ రోజు నిరహార దీక్ష కొనసాగిస్తున్న సిర్పూర్ ఎమ్యెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జీవో నం.49, పోడు రైతుల సమస్యలపై జిల్లా పర్యటనలో ఉన్న ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని డిమాండ్ చేశారు.ప్రధానంగా ఈ రెండు సమస్యలపై జిల్లా వాసులకు ఉపశమనం కలగాలంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. బుదవారం రోజున మూడవ రోజు నిరాహార దీక్షను కొనసాగిస్తున్న సిర్పూర్ ఎమ్యెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు కి మద్దతు తెలిపిన బెజ్జూర్ చేనేత సహకార సంఘం కార్మికులు.