Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 9:45 pm Posted by : Anjaneyulu Dega

సన్న బియ్యం పంపిణీ చేసిన తాండూర్ తహసీల్దార్

ఆంజనేయులు న్యూస్, తాండూర్: రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుండి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో  గురువారం తాండూర్ మండల తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు.. అనంతరం మండలంలోని వివిధ రేషన్ షాపులలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలకు సరఫరా చేస్తున్నా తీరును పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఎలాంటి సమస్య రాకుండ సక్రమంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. తహసీల్దార్ చేపట్టిన తనిఖీలో మండల ఎంపీడీఓ శ్రీనివాస్, గిర్దవార్, తాండూర్ సిఐ కుమారస్వామి, లబ్ధిదారులు మరియు కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు…