Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 October 2023, 9:22 pm Posted by : Anjaneyulu Dega

నూతన వస్త్రాలు పంపిణీ చేసిన కౌన్సిలర్

మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలో విధులు నిర్వర్తించే మున్సిపల్ కార్మికులకు దసరా పండుగను పురస్కరించుకొని వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్ శుక్రవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డును పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యానికి మున్సిపల్ కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు యూత్ అద్యక్షుడు కొత్తురి సంతోష్ వార్డు బీఆర్ఎస్ నాయకులు నాగరపు రాకేష్. బుధర్థి విజయ్. అనిల్, ప్రశాంత్ మరియు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు..