విద్యాసంస్థలకు ఆ రెండు రోజులు సర్కార్ సెలవులు ప్రకటించింది.
గ్రూప్-2 పరీక్ష జరిగే కేంద్రాలకే వర్తింపు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నందున పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆ రెండు రోజులు సర్కార్ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 5.5 లక్షల మంది దరఖాస్తు చేశారు.