
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తుల వారు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 55 సం॥ల వయస్సు గల వెనుకబడిన వర్గాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలని, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1 లక్ష రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయలు గల వారు ఆన్లైన్లో tsobmmsbc.cgg.gov.in ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చేతుల మీదుగా మంచిర్యాలలో ఈ పథకం ప్రారంభించడం జరుగుతుందని, ఆధార్కార్డు, కులం, ఆదాయ ధృవపత్రం-2023, నివాస ధృవీకరణ పత్రం, రేషన్కార్డు, ఫొటోలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.