
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్ప గుచ్ఛంతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు..