Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 06 January 2023, 10:34 am Posted by : Anjaneyulu Dega

కస్తూర్బా ఎస్ ఓ అమూల్య సస్పెండ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నెన్నెల కస్తూర్భాపాఠశాల ఎస్ ఒ అమూల్య ను డీఈవో వెంకటేశ్వర్లు గురువారం సస్పెండ్ చేశారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టకపోవడం విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో విచారణ జరిపిన అనంతరం సస్పెండ్ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు. గతంలో కూడా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే నెన్నెల కస్తూర్బా పాఠశాలకు మానవతా దృక్పథంతో పోస్టింగ్ ఇచ్చినట్లు వివరించారు.