Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 December 2022, 12:15 am Posted by : anjudega

హైదరాబాద్ కు భగవంత్ మాన్.. సీఎం కేసీఆర్ తో బేటీ

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మంగళవారం హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మంగళవారం హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు. నగరంలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వస్తునర్న భగవంత్ మాన్. హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ను ప్రగతిభవన్ కు ఆహ్వానించారు. మంగళవారం మధ్యాహ్నం ఇరువురు సమావేశం కానున్నారు. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.