తెలంగాణలో రైతులకు ఈనెల 28 నుంచి యాసంగి సీజన్ కు సంబంధించి రైతుబంధు సాయం అందనుంది. ఈమేరకు సీఎం కేసీఆర్ ఆర్థికమంత్రిని ఆదేశించారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు సాయం ఈనెల 28 నుంచి రైతులకు అందనుంది. యాసంగి పెట్టుబడి సాయాన్ని ఈనెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్థికమంత్రి హరీశ్ రావును సీఎం ఆదేశించారు. ఎప్పటి లాగే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమచేయనుంది. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. యాసంగి సీజన్ కు రైతు బంధు కింద రూ. 7,600 కోట్లు సాయం అదించే అవకాశం ఉంది.