Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 December 2022, 3:25 pm Posted by : anjudega

ప్రజాసంక్షేమమే కెసిఆర్ లక్ష్యం

బిఆర్ఎస్ యువనాయకుడు నాడిపెల్లి విజిత్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ యువనాయకుడు నాడిపెల్లి విజిత్ రావు అన్నారు. గడపగడప బిఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామంలో అయన ఇంటింటికి తిరుగుతూ కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహనా కల్పించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారం జరిగేలా అధికారులకు ప్రజాప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, నాయకులు ఎల్తాపు సుభాష్, గాలిపెల్లి సత్యం, పత్తిపాక శ్రీనివాస్, కోమటిపెల్లి యుగేందర్, నుల తిరుపతి, రామస్వామి, నరేష్, గంగన్న, డాంక లక్ష్మణ్, గాండ్ల నరేష్, పత్తిపాక సంతోష్, నలిమేలా మహేష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.