Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 November 2022, 7:57 pm Posted by : Anjaneyulu Dega

వాహనాలపై స్పెషల్ డ్రైవ్

ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, విధిగా నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనాదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న: ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రం లోని బెల్లంపల్లి చౌరస్తాలో మంగళవారం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, విధిగా నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనాదారులపై మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ. వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరిస్తూ ప్రతి ఒక్క వాహనంకు నెంబర్ ప్లేట్ తో పాటు సరియైన వాహన ధ్రువీకరణ పత్రాలు ఉంచుకోవాలని మరియు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ వాహనాలను నడపాలని, సిగ్నల్ జంప్, జీబ్రా లైన్ ముందే తమ వాహనాలను ఆపాలని సూచించారు. ప్రతిరోజూ ఇలాగే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని కావున ప్రతిఒక్కరు విధిగా నెంబర్ ప్లేట్ మరియ ధ్రువీకరణ పత్రాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివకేశవులు, మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.