Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 November 2022, 9:59 pm Posted by : Anjaneyulu Dega

హైదరాబాద్ లో దారుణం.?

బాలుడి మర్మాంగాలపై టపాసులు కాల్చిన యువకులు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడిని పట్టుకుని మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ.. వీడియో తీస్తున్న దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్కు చెందిన 16 ఏళ్ల బాలుడిని.. ఓ రెడీమిక్స్ కర్మాగారంలో పనిచేసేందుకు వారి బంధువులు 3 నెలల క్రితం పంపించారు. కొన్నిరోజుల నుంచి ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న అక్కడి కొందరు యువకులు.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు. బాలుడిని కదలకుండా గట్టిగా పట్టుకొని టపాసులు పేలుస్తూ వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. వైరల్ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు.. ఘటనపై యూపీలోని కుషీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.